అక్టోబర్ 6న యస్వీరంగారావు విగ్రహావిష్కరణ
- October 04, 2019
ఈ నెల 6న తాడేపల్లి గూడెంలో ఈ నెల 6న విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానునున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ ఆగస్టులోనే జరగాలి. కానీ, ప్రభుత్వం అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు దసరా కానుకగా యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు మెగా అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేసారు.
కార్యక్రమం డేటుకి సంబంధించిన ఫోస్టర్ ని విడుదల చేశారు. ఐతె, ఇది సైరా ప్రమోషన్స్ స్టంట్ అనే విమర్షలు కూడా వస్తున్నాయి. వాటిని మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు. ఇక ఈ నెల 6న చిరంజీవి వస్తున్నాడని తెలిసి ఉభయగోదావరిలోని మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ కి ఘన స్వాగతం లభించనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







