ఇరాక్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు 60మందికి పైగా మృతి...
- October 05, 2019
బాగ్దాద్: ఇరాక్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీస్తున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 60 మందికి పైగా మృతిచెందారు. మరో 2500మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మొఖ్తదా అల్ సదర్ నేతృత్వంలో తిరుగుబాటు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు.ప్రధానమంత్రి అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదిల్ అబ్దెల్ మహ్దీ ఇంతకుముందు నిరసనకారుల "చట్టబద్ధమైన డిమాండ్లు" విన్నారని, అయితే ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్దాద్ నగరాల్లో అల్లర్లు హెచ్చుమీరాయి. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా ప్రతినిధులు అన్ని రకాల సమావేశాలను బహిష్కరిస్తారని ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







