హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం
- October 11, 2019హైదరాబాద్:విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నెత్తి శఠగోపం పెట్టిన కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నానికి చెందిన అజీజ్ మరికొంత మంది కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ పేరిట ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు. ఈ వ్యవహారంపై గత మే నెలలో కన్సల్టెన్సీపై ఆసిఫానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. గురువారం అజీజ్తో పాటు మరికొంత మంది నాంపల్లి కోర్టుకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..