హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం

- October 11, 2019 , by Maagulf
హైదరాబాద్:దుబాయ్ లో  ఉద్యోగం పేరిట ఘరానా మోసం

హైదరాబాద్:విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నెత్తి శఠగోపం పెట్టిన కింగ్‌డమ్‌ ఆఫ్‌ యూనివర్స్‌ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నానికి చెందిన అజీజ్‌ మరికొంత మంది కింగ్‌డమ్‌ ఆఫ్‌ యూనివర్స్‌ పేరిట ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు. ఈ వ్యవహారంపై గత మే నెలలో కన్సల్టెన్సీపై ఆసిఫానగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. గురువారం అజీజ్‌తో పాటు మరికొంత మంది నాంపల్లి కోర్టుకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com