'ప్లాస్టిక్ రహిత భారత్' కు నేను సైతం అంటున్న మోడీ

- October 12, 2019 , by Maagulf
'ప్లాస్టిక్ రహిత భారత్' కు నేను సైతం అంటున్న మోడీ

ఇండియా, చైనా శిఖరాగ్ర సదస్సుకు మహాబలిపురం వేదికగా మారింది. నిన్నటి రోజున మహాబలిపురం వెళ్లిన మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు మహాబలిపురం టెంపుల్ లో సమావేశం అయ్యారు. అక్కడి శోర్ దేవాలయంలో గంటకు పైగా గడిపారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇక ఈరోజు కూడా మహాబలిపురంలోనే ఉన్నారు.

ఈ ఉదయం మోడీ మహాబలిపురం బీచ్ లో వాకింగ్ చేశారు. బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తీసి కవర్లో వేశారు. ఈ ఉదయం దాదాపు అరగంటకు పైగా మోడీ బీచ్ లో గడిపాడు. ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com