దోపిడీకి గురైన మరో ఇండియన్ ఫుడ్ డెలివరీ బాయ్
- October 14, 2019
కువైట్: ఓ పఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ హోమ్ డెలివరీ సర్వీస్ విబాగంలో పనిచేస్తోన్న భారత వలసదారుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులు తనపై దోపిడీకి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్ సులైబియాలోని మెయిన్ ల్యాండ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. 80 దినార్లు బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారుడికి డెలివరీ చేయాల్సిన ఫుడ్ని సైతం బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నారని అధికారులు వివరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







