తెలంగాణ ప్రజా సమితి ఖతర్ (TPS)బతుకమ్మ,దసరా సంబరాలు
- October 15, 2019
దోహా:తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఐసిసి లో బతుకమ్మ & దసరా పండుగ వేడుకలను నిర్వహించింది. ' బతుకమ్మ ప్రత్యేక, వైభవ ఉత్సవం తల్లి ప్రకృతికి కృతజ్ఞతలు తేలీపారు. పెద్ద సంఖ్యలో మహిళలు గానం మరియు నృత్యం చేసే ఈ ఆచారంలో పాల్గొన్నారు. వందలాది ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సహంగ వచ్చారు.
తెలంగాణకు చెందిన మహిళలు అశోకా హాల్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసీసీ) లో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయ బద్దంగా మహిళలు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు మరియు అద్భుతమైన పుష్ప ఏర్పాట్లతో రంగురంగుల సిల్క్ మరియు పట్టు చీరలు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాదు నుండి జయకేతనం ఎగురవేసిన సుప్రసిద్ధ కళాకారులు, తెలంగాణ ప్రముఖ జానపద గాయకులు మిట్టపల్లి సురేందర్, వొల్లెల వాణి . ప్రేక్షకుల తమ పాటలతొ సమ్మోహితులన్ చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ తెలంగాణ ప్రజా సమితి యొక్క (TPS) మహిళలు మరియు పిల్లలు చెసిన డాన్స్ లు జనాన్ని ఉరృతలు ఊగించాయ్.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిసి అధ్యక్షుడు శ్రీ మణి కంర్ణన్, ఐసిసి ఉపాధ్యక్షుడు వినోద్ నాయర్,నయన వాగ్, ICBFకు చెందిన రజని మూర్తి, ICC యొక్క భూమేశ్వర్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో TPS ఉపాధ్యక్షునిగా గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ, హజారైన ప్రముఖులందరికీ, స్పాన్సర్స్ కు, ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపి, భవిష్యత్తులో కూడా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఛానల్ 5 మీడియా భాగస్వామిగా ఉంది.
తెలంగాణ ప్రజా సమితి ఖతర్ అధ్యక్షుడు తిరుపతి వచ్చిన ప్రముఖ అతిథులందరినీ సత్కరించారు.
ఉత్తమ బతుకమ్మ ఏర్పాట్లకు ఆర్గనైజర్లు అవార్డులను సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం బతుకమ్మను నీటి ట్యాంకుల్లో నిమజ్జనం చేసి, వచ్చే ఏడాది తిరిగి రావాలని బతుకమ్మలను ప్రార్థించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







