గోల్డ్‌ తరలింపు: ఇండియాలోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక

- October 15, 2019 , by Maagulf
గోల్డ్‌ తరలింపు: ఇండియాలోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక

ఢిల్లీ:ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌లోని యూఏఈ ఎంబసీ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల్ని ఉద్దేశించి ఓ హెచ్చరికను ట్విట్టర్‌ ద్వారా జారీ చేసింది. ఈ హెచ్చరిక సారాంశంలోకి వెళితే, ఇండియాకి వెళ్ళాలనుకుంటున్న యూఏఈ జాతీయులు, తమ గోల్డ్‌ జ్యుయెలరీని సంబంధిత అథారిటీస్‌ వద్ద డిస్‌క్లోజ్‌ చేయాలని పేర్కొంది. ఇండియన్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో సంబంధిత అథారిటీస్‌కి తమ జ్యుయెలరీకి సంబంధించిన వివరాలు అందజేయడం ద్వారా చట్టపరమైన సమస్యలుండవని ఆ హెచ్చరికలో పేర్కొంది. కాగా, అబుధాబిలోని ఇండియన్‌ ఎంబసీ - కస్టమ్స్‌ గైడ్‌ ప్రకారం, విదేశాల్లో స్థిరపడి ఇండియాకి తిరిగి వెళ్ళే భారత వలసదారులు, మహిళలైతే ఒక్కొక్కరూ తమ వెంట 1,00,000 విలువ చేసే బంగారాన్ని, పురుషులైతే 50,000 విలువ గల బంగారాన్ని తీసుకు వెళ్ళవచ్చు. కాగా, కస్టమ్స్‌ డ్యూటీ 12.5 శాతం చెల్లించి ఒక్కో ప్రయాణీకుడు కిలో బంగారం వరకూ తీసుకెళ్ళొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com