గోల్డ్ తరలింపు: ఇండియాలోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక
- October 15, 2019
ఢిల్లీ:ఇండియన్ సబ్ కాంటినెంట్లోని యూఏఈ ఎంబసీ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల్ని ఉద్దేశించి ఓ హెచ్చరికను ట్విట్టర్ ద్వారా జారీ చేసింది. ఈ హెచ్చరిక సారాంశంలోకి వెళితే, ఇండియాకి వెళ్ళాలనుకుంటున్న యూఏఈ జాతీయులు, తమ గోల్డ్ జ్యుయెలరీని సంబంధిత అథారిటీస్ వద్ద డిస్క్లోజ్ చేయాలని పేర్కొంది. ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో సంబంధిత అథారిటీస్కి తమ జ్యుయెలరీకి సంబంధించిన వివరాలు అందజేయడం ద్వారా చట్టపరమైన సమస్యలుండవని ఆ హెచ్చరికలో పేర్కొంది. కాగా, అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ - కస్టమ్స్ గైడ్ ప్రకారం, విదేశాల్లో స్థిరపడి ఇండియాకి తిరిగి వెళ్ళే భారత వలసదారులు, మహిళలైతే ఒక్కొక్కరూ తమ వెంట 1,00,000 విలువ చేసే బంగారాన్ని, పురుషులైతే 50,000 విలువ గల బంగారాన్ని తీసుకు వెళ్ళవచ్చు. కాగా, కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం చెల్లించి ఒక్కో ప్రయాణీకుడు కిలో బంగారం వరకూ తీసుకెళ్ళొచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







