హెల్త్ కేర్, ఎడ్యుకేషన్పై యుఏఈ ఫోకస్
- January 11, 2016
హెల్త్ కేర్ రంగంపైనా, ఎడ్యుకేషన్ రంగంపైనా ఇకపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని యూఏఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎమిరేటిస్తోపాటు ఇక్కడ నివసిస్తున్నవారికి సంబంధించి హెల్త్కేర్, ఎడ్యుకేషన్ అతి ముఖ్యమైన అంశాలని యూఏఈ క్యాబినెట్ అభిప్రాయపడింది. దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యుఏఈ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నాయకత్వంలో జరిగిన ఈ మీటింగ్లో, ఆసుపత్రుల్లో వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం, స్కూల్ టీచర్లకు నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పబ్లిక్ హాస్పిటల్స్లో వెయిటింగ్ సమయంతోపాటు, సర్జరీ సక్సెస్ రేట్, ఆసుపత్రిలో వుండే సమయం, పేషెంట్ సంతృప్తి వంటి అంశాలతో రికార్డ్స్ని రూపొందించి, వాటి ద్వారా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనకు వీలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ విభాగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని షేక్ మహమ్మద్ చెప్పారు. అందరికీ అతి ముఖ్యమైన ఈ రెండు అంశాల్లో యూఏఈ గణనీయమైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. యూఏఈలో ఎనర్జీ మరియు వాతావరణ మార్పుల గురించీ చర్చించింది. అలాగే విద్యుత్ ఆదాపైనా చర్చించి, పొదుపుగా విద్యుత్ని ఉపయోగించే బల్బుల వినియోగంపై అవగాహన కల్పించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎమిరేట్స్ జనరల్ పెట్రోలియం కార్పొరేషన్ రిస్ట్రక్చరింగ్ని క్యాబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







