ఖతార్:కేరళ నర్సు దంపతుల ఇద్దరు చిన్నారుల మృతి.....
- October 19, 2019
దోహా: ఖతార్లో నర్సులుగా ఉద్యోగం చేస్తున్న భారతీయ దంపతుల ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి. అల్లారుముద్దుగా చూసుకుంటున్న వారి ఇద్దరు చిన్నారులు ఒకే రోజు మృతిచెందారు. వీరిలో మూడున్నరేళ్ల రిదు తెల్లవారుజామున 3గంటలకు మరణించగా, ఏడు నెలల వయసున్న రిదా ఉదయం 10గంటలకు తుదిశ్వాస విడిచింది. వీరిద్దరూ కేరళలోని కోజికోడ్ కు చెందన హారిస్, షమీమా దంపతుల సంతానం.హరిస్ అబే నకాలా పబ్లిక్ హెల్త్ సెంటర్ లో నర్సు కాగా, దోహాలోని నసీమ్ అల్ రబీహ్ మెడికల్ సెంటర్లో షమీమా నర్సుగా ఉంది.చిన్నారులిద్దరూ ఫుడ్పాయిజనింగ్ వల్లే మృతిచెందారని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. పిల్లలు మరణించిన హమద్ హాస్పటల్లోనే హారిస్ దంపతులు కూడా చికిత్స పొందుతున్నారని షమీమా కొలీగ్స్ తెలియజేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







