ఖతార్:కేరళ నర్సు దంపతుల ఇద్దరు చిన్నారుల మృతి.....
- October 19, 2019
దోహా: ఖతార్లో నర్సులుగా ఉద్యోగం చేస్తున్న భారతీయ దంపతుల ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి. అల్లారుముద్దుగా చూసుకుంటున్న వారి ఇద్దరు చిన్నారులు ఒకే రోజు మృతిచెందారు. వీరిలో మూడున్నరేళ్ల రిదు తెల్లవారుజామున 3గంటలకు మరణించగా, ఏడు నెలల వయసున్న రిదా ఉదయం 10గంటలకు తుదిశ్వాస విడిచింది. వీరిద్దరూ కేరళలోని కోజికోడ్ కు చెందన హారిస్, షమీమా దంపతుల సంతానం.హరిస్ అబే నకాలా పబ్లిక్ హెల్త్ సెంటర్ లో నర్సు కాగా, దోహాలోని నసీమ్ అల్ రబీహ్ మెడికల్ సెంటర్లో షమీమా నర్సుగా ఉంది.చిన్నారులిద్దరూ ఫుడ్పాయిజనింగ్ వల్లే మృతిచెందారని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. పిల్లలు మరణించిన హమద్ హాస్పటల్లోనే హారిస్ దంపతులు కూడా చికిత్స పొందుతున్నారని షమీమా కొలీగ్స్ తెలియజేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







