ఖతార్:కేరళ నర్సు దంపతుల ఇద్దరు చిన్నారుల మృతి.....

- October 19, 2019 , by Maagulf
ఖతార్:కేరళ నర్సు దంపతుల ఇద్దరు చిన్నారుల మృతి.....

దోహా: ఖతార్‌లో నర్సులుగా ఉద్యోగం చేస్తున్న భారతీయ దంపతుల ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి. అల్లారుముద్దుగా చూసుకుంటున్న వారి ఇద్దరు చిన్నారులు ఒకే రోజు మృతిచెందారు. వీరిలో మూడున్నరేళ్ల రిదు తెల్లవారుజామున 3గంటలకు మరణించగా, ఏడు నెలల వయసున్న రిదా ఉదయం 10గంటలకు తుదిశ్వాస విడిచింది. వీరిద్దరూ కేరళలోని కోజికోడ్ కు చెందన హారిస్, షమీమా దంపతుల సంతానం.హరిస్ అబే నకాలా పబ్లిక్ హెల్త్ సెంటర్ లో నర్సు కాగా, దోహాలోని నసీమ్ అల్ రబీహ్ మెడికల్ సెంటర్‌లో షమీమా నర్సుగా ఉంది.చిన్నారులిద్దరూ ఫుడ్‌పాయిజనింగ్ వల్లే మృతిచెందారని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. పిల్లలు మరణించిన హమద్ హాస్పటల్‌లోనే హారిస్ దంపతులు కూడా చికిత్స పొందుతున్నారని షమీమా కొలీగ్స్ తెలియజేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com