ఖతార్:కేరళ నర్సు దంపతుల ఇద్దరు చిన్నారుల మృతి.....
- October 19, 2019
దోహా: ఖతార్లో నర్సులుగా ఉద్యోగం చేస్తున్న భారతీయ దంపతుల ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి. అల్లారుముద్దుగా చూసుకుంటున్న వారి ఇద్దరు చిన్నారులు ఒకే రోజు మృతిచెందారు. వీరిలో మూడున్నరేళ్ల రిదు తెల్లవారుజామున 3గంటలకు మరణించగా, ఏడు నెలల వయసున్న రిదా ఉదయం 10గంటలకు తుదిశ్వాస విడిచింది. వీరిద్దరూ కేరళలోని కోజికోడ్ కు చెందన హారిస్, షమీమా దంపతుల సంతానం.హరిస్ అబే నకాలా పబ్లిక్ హెల్త్ సెంటర్ లో నర్సు కాగా, దోహాలోని నసీమ్ అల్ రబీహ్ మెడికల్ సెంటర్లో షమీమా నర్సుగా ఉంది.చిన్నారులిద్దరూ ఫుడ్పాయిజనింగ్ వల్లే మృతిచెందారని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. పిల్లలు మరణించిన హమద్ హాస్పటల్లోనే హారిస్ దంపతులు కూడా చికిత్స పొందుతున్నారని షమీమా కొలీగ్స్ తెలియజేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!