యూ.ఏ.ఈ లో డెసర్ట్ బైక్ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి
- October 19, 2019
అల్ మదాం: యూఏఈలోని అల్ మదాం పట్టణంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం షికారుకు వెళ్లిన వారు..డెసర్ట్ బైక్స్ నడుపుతుండగా ఈ ప్రమాదం రాత్రి 07:30లకు జరిగింది. ఓ పెద్ద ఇసుక మేటను ఎక్కేందుకు వారు ప్రయత్నించారని, ఆ సమయంలో వారి వాహనాలు అదుపుతప్పాయని తెలిసింది. దాంతో ఆ వాహనాలు దొర్లుకుంటూ కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయులకు 38ఏళ్ల వయసున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.మరో ఇద్దరు యువకులకు 20 ఏళ్ళ వయస్సు వారికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిని అల్ ధాయిద్ హాస్పటల్ లో ICU లో చికిత్స అందిస్తున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎందుకు జరిగిందో దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







