యూ.ఏ.ఈ లో డెసర్ట్ బైక్ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి
- October 19, 2019
అల్ మదాం: యూఏఈలోని అల్ మదాం పట్టణంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం షికారుకు వెళ్లిన వారు..డెసర్ట్ బైక్స్ నడుపుతుండగా ఈ ప్రమాదం రాత్రి 07:30లకు జరిగింది. ఓ పెద్ద ఇసుక మేటను ఎక్కేందుకు వారు ప్రయత్నించారని, ఆ సమయంలో వారి వాహనాలు అదుపుతప్పాయని తెలిసింది. దాంతో ఆ వాహనాలు దొర్లుకుంటూ కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయులకు 38ఏళ్ల వయసున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.మరో ఇద్దరు యువకులకు 20 ఏళ్ళ వయస్సు వారికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిని అల్ ధాయిద్ హాస్పటల్ లో ICU లో చికిత్స అందిస్తున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎందుకు జరిగిందో దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







