యూ.ఏ.ఈ లో డెసర్ట్ బైక్ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి

- October 19, 2019 , by Maagulf
యూ.ఏ.ఈ లో డెసర్ట్ బైక్ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి

అల్ మదాం: యూఏఈలోని అల్ మదాం పట్టణంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం షికారుకు వెళ్లిన వారు..డెసర్ట్ బైక్స్ నడుపుతుండగా ఈ ప్రమాదం రాత్రి 07:30లకు జరిగింది. ఓ పెద్ద ఇసుక మేటను ఎక్కేందుకు వారు ప్రయత్నించారని, ఆ సమయంలో వారి వాహనాలు అదుపుతప్పాయని తెలిసింది. దాంతో ఆ వాహనాలు దొర్లుకుంటూ కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయులకు 38ఏళ్ల వయసున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.మరో ఇద్దరు యువకులకు 20 ఏళ్ళ వయస్సు వారికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిని అల్ ధాయిద్ హాస్పటల్‌ లో ICU లో చికిత్స అందిస్తున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎందుకు జరిగిందో దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com