యూఏఈని కమ్మేసిన పొగమంచు: వాహనదారులకు సూచనలు
- October 24, 2019
యూఏఈ లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) ఈ మేరకు వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. షార్జా ఎయిర్పోర్ట్ ఏరియా, స్వీహాన్ మరియు మదినాత్ జాయెద్ అలాగే అల్ మిన్హాద్ ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు కన్పించింది. మరికొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు యూఏఈలో వుంటాయని ఎన్సిఎం పేర్కొంది. వాహనదారులు తమ వేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల కంటే మించకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా వుంటే, కోస్టల్ ఏరియాస్లో హ్యుమిడిటీ 70 నుంచి 90 శాతం వరు వుంటుందనీ, ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతాయనీ, మౌంటెయిన్స్లో 50 నుంచి 70 శాతం హ్యుమిడిటీ వుంటుందని ఎన్సిఎం పేర్కొంది. సోమవారం వరకు ఫాగీ మరియు హ్యుమిడ్ వాతావరణం యూఏఈలో కొనసాగుతుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







