యూఏఈని కమ్మేసిన పొగమంచు: వాహనదారులకు సూచనలు
- October 24, 2019
యూఏఈ లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) ఈ మేరకు వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. షార్జా ఎయిర్పోర్ట్ ఏరియా, స్వీహాన్ మరియు మదినాత్ జాయెద్ అలాగే అల్ మిన్హాద్ ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు కన్పించింది. మరికొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు యూఏఈలో వుంటాయని ఎన్సిఎం పేర్కొంది. వాహనదారులు తమ వేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల కంటే మించకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా వుంటే, కోస్టల్ ఏరియాస్లో హ్యుమిడిటీ 70 నుంచి 90 శాతం వరు వుంటుందనీ, ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతాయనీ, మౌంటెయిన్స్లో 50 నుంచి 70 శాతం హ్యుమిడిటీ వుంటుందని ఎన్సిఎం పేర్కొంది. సోమవారం వరకు ఫాగీ మరియు హ్యుమిడ్ వాతావరణం యూఏఈలో కొనసాగుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







