యూఏఈని కమ్మేసిన పొగమంచు: వాహనదారులకు సూచనలు
- October 24, 2019
యూఏఈ లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) ఈ మేరకు వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. షార్జా ఎయిర్పోర్ట్ ఏరియా, స్వీహాన్ మరియు మదినాత్ జాయెద్ అలాగే అల్ మిన్హాద్ ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు కన్పించింది. మరికొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు యూఏఈలో వుంటాయని ఎన్సిఎం పేర్కొంది. వాహనదారులు తమ వేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల కంటే మించకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా వుంటే, కోస్టల్ ఏరియాస్లో హ్యుమిడిటీ 70 నుంచి 90 శాతం వరు వుంటుందనీ, ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతాయనీ, మౌంటెయిన్స్లో 50 నుంచి 70 శాతం హ్యుమిడిటీ వుంటుందని ఎన్సిఎం పేర్కొంది. సోమవారం వరకు ఫాగీ మరియు హ్యుమిడ్ వాతావరణం యూఏఈలో కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!