ఉత్తర ఆర్మీ కమాండర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్
- October 24, 2019జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలోని బీడర్ ఏరియాలో ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. రణ్ బీర్ సింగ్ తో పాటుగా మరో ఆరుగురు కూడా హెలికాఫ్టర్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి అందరూ సేఫ్ గా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
క్రాష్ అయిన హెలికాప్టర్ ప్రదేశానికి ఆర్మీ అధికారులు హుటాహుటిన బయలుదేరారు. ప్రత్యేక చాపర్ బయలుదేరి వెళ్లారు. స్పాట్ లో సిట్యువేషన్ అంచనా వేస్తున్నారు. కమాండర్ స్థాయి అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ కావటంతో అంతా అలర్ట్ అయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనలో ఆర్మీ కమాండర్ తోపాటు పైలెట్ పరిస్థితిపైనా ఆరా తీస్తున్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఆర్మీ ఉన్నతాధికారులు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?