బహ్రెయిన్‌ నుంచి భారత్‌కి: వలసదారుడికి విముక్తి

- October 28, 2019 , by Maagulf
బహ్రెయిన్‌ నుంచి భారత్‌కి: వలసదారుడికి విముక్తి

భారతీయ వలసదారుడొకరు, 36 ఏళ్ళుగా కింగ్‌డమ్‌లో ఇరుక్కుపోయి, స్వదేశానికి వెళ్ళలేక సతమతమవుతుండగా, ఇన్నేళ్ళకు అతనికి విముక్తి కలిగింది. 1983లో అలోసియస్‌ ఇర్నెస్ట్‌ అనే భారత వలసదారుడు బహ్రెయిన్‌ చేరుకున్నాడు. అయితే, 2010లో బిజినెస్‌ పార్టనర్‌ని మోసం చేశాడనే అభియోగాలపై అలోసియస్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్‌ నుంచి వెళ్ళలేకపోయిన అలోసియస్‌కి ఎట్టకేలకు ఇండియన్‌ కమ్యూనిటీ రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయం అందింది. ఇండియన్‌ ఎంబసీ, బాధితుడు స్వదేశానికి చేరుకునేందుకు టిక్కెట్‌ అందించింది. దాంతో అలోసియస్‌, స్వదేశానికి చేరుకున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com