రాజకీయనాయకులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్

- October 31, 2019 , by Maagulf
రాజకీయనాయకులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్

రోజుకో అప్‌డేట్‌తో మరింత మందికి చేరువవుతోంది సోషల్ మీడియా మాద్యమం ట్విట్టర్.. ఇక, ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రకటనలు కూడా కొదవలేదు.. అయితే, తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించనున్నట్టు ట్విట్టర్ సీఈవో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని నవంబరు 22వ తేదీ నుంచి అమలు చేయనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15వ తేదీన వెల్లడించనున్నట్టు ట్విటర్‌ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. "రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప వాటిని కొనకూడదంటూ" ట్వీట్ చేశారు జాక్ డోర్సే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com