యూఏఈ: జీబ్రా క్రాసింగ్ ఉల్లంఘన 400, 500 దిర్హామ్ల జరీమానా
- November 04, 2019
అజ్మన్ పోలీస్, రోడ్ క్రాసింగ్ సేఫ్టీ ఇనీషియేటివ్ని ప్రారంభించారు. పాదచారులకు సంబంధించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. అజమ్మన్ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అబ్దుల్లా అల్ ఫలాసి మాట్లాడుతూ, మూడు వారాల పాటు ఈ ఇనీషియేటివ్ కొనసాగుతుందని చెప్పారు. పాదచారులు చేసే తప్పిదాలు, అలాగే జీబ్రా క్రాసింగ్స్ విషయంలో వాహనదారులు చేసే తప్పుల్ని సరిదిద్దడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యం. జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా మరో చోట రోడ్డును క్రాస్ చేసే వారికి 400 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనదారులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 500 దిర్హామ్లు జరీమానా విధించనున్నారు అధికారులు. 500 దిర్హామ్ల జరీమాఆతోపాటు 6 ట్రాఫిక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







