యూఏఈ: జీబ్రా క్రాసింగ్‌ ఉల్లంఘన 400, 500 దిర్హామ్‌ల జరీమానా

- November 04, 2019 , by Maagulf
యూఏఈ: జీబ్రా క్రాసింగ్‌ ఉల్లంఘన 400, 500 దిర్హామ్‌ల జరీమానా

అజ్మన్ పోలీస్‌, రోడ్‌ క్రాసింగ్‌ సేఫ్టీ ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. పాదచారులకు సంబంధించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. అజమ్మన్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సైఫ్‌ అబ్దుల్లా అల్‌ ఫలాసి మాట్లాడుతూ, మూడు వారాల పాటు ఈ ఇనీషియేటివ్‌ కొనసాగుతుందని చెప్పారు. పాదచారులు చేసే తప్పిదాలు, అలాగే జీబ్రా క్రాసింగ్స్‌ విషయంలో వాహనదారులు చేసే తప్పుల్ని సరిదిద్దడం ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశ్యం. జీబ్రా క్రాసింగ్‌ వద్ద కాకుండా మరో చోట రోడ్డును క్రాస్‌ చేసే వారికి 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. జీబ్రా క్రాసింగ్‌ వద్ద వాహనదారులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 500 దిర్హామ్‌లు జరీమానా విధించనున్నారు అధికారులు. 500 దిర్హామ్‌ల జరీమాఆతోపాటు 6 ట్రాఫిక్‌ పాయింట్స్‌ కూడా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com