ఇకపై వారానికి 4రోజులే ఆఫీస్..
- November 05, 2019
జపాన్:పని ఉందంటూ లీవ్ పెట్టేపన్లేదు.. ఇప్పుడే వస్తానంటూ పని మధ్యలో పర్మిషన్ అడిగే అవసరం అసలే లేదు.. వారానికి 4 రోజులు ఆఫీస్కి రండి. మిగతా మూడు రోజులు మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లండి.. ఏమైనా చేస్కోండి అని అంటోంది జపాన్కు చెందిన మైక్రోసాప్ట్ కంపెనీ. జపాన్లో ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులు సమయమంతా ఆఫీసులోనే గడి పేస్తున్నారట. కుటుంబసభ్యులతో గడపడానికి టైమ్ ఉండట్లేదు. జీవితంలో ఓ సరదా.. సంతోషం ఏమీ లేకుండా పోతోంది. ఈ విషయాన్ని గుర్తించిన మైక్రోసాప్ట్ 2300 మంది ఉద్యోగులకు మూడు రోజులు వీకాఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఓనెల ట్రయిల్ రన్ నడిపి రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయాలనుకుంటోంది సంస్థ.
సాధారణంగా ఏ కంపెనీలో అయినా సెలవు కావాలని అడిగితే మరైతే ఈ రోజే రేపటి పని కూడా పూర్తి చేసి వెళ్లు అని చెబుతారు. కానీ ఇక్కడ అలా కాదు. ఉన్న సమయంలోనే క్వాలిటీ వర్క్ని అందించమంటోంది. టీ, కాఫీల పేరుతో గంటల తరబడి క్యాంటిన్లో కూర్చోవద్దు. చిన్న చిన్న పనులకు కూడా మీటింగ్ పేరుతో సమయాన్ని వృధా చేయొద్దు అని మాత్రం కండిషన్ పెట్టిందట.
దాంతో చాలా సమయం అదా అవుతుంది. యాజమాన్యం ఇచ్చిన డెడ్లైన్కే వర్క్ని పూర్తిచేస్తున్నారు జపాన్ ఉద్యోగులు. మైక్రోసాప్ట్ చేపట్టిన ఈ ప్రయత్నం ఫలిస్తే దీన్నే కొనసాగించాలనుకుంటోంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మిగతా కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







