మెర్క్యురీ ట్రాన్సిట్‌: యూఏఈలో అరుదైన దృశ్యం

- November 11, 2019 , by Maagulf
మెర్క్యురీ ట్రాన్సిట్‌: యూఏఈలో అరుదైన దృశ్యం

యూఏఈ రెసిడెంట్స్‌ మెర్క్యురీ ట్రాన్సిట్‌ని చూసేందుకు అరుదైన అవకాశం కలిగింది. నవంబర్‌ 11న సూర్యుడి మీదుగా మెర్క్యురీ గ్రహం ట్రాన్సిట్‌ కాబోతోంది. అది భూమి మీద నుంచి చూసేవారికి ఓ చిన్న నల్లటి చుక్కలా కన్పిస్తుంది. మళ్ళీ ఇలాంటి ఘటన చూడాలంటే 2032 నవంబర్‌ వరకు వేచి చూడాల్సి వస్తుంది. కాగా, దుబాయ్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌, అల్‌ తురాయా ఆస్ట్రానమీ సెంటర్‌ వద్ద ఈ మెర్య్యురీ ట్రాన్సిట్‌ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలు మెర్యురీ ట్రాన్సిట్‌ని చూడాలంటే, తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 50 రెట్లు జూమింగ్‌ సామర్థ్యం గలిగిన, రక్షణాత్మకమైన ఫిల్టర్స్‌ కలిగిన సాధనాలతో మాత్రమే దీన్ని చూడాల్సి వుంటుంది. లేనిపక్షంలో, కంటికి తీవ్రమైన ప్రమాదం కలగొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com