బంగ్లాదేశ్లో రైలు ప్రమాదం...15 మంది మృతి
- November 12, 2019
ఢాకా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. బంగ్లాదేశ్లోని బ్రహ్మన్ బరియాలోని మండోభాగ్ రైల్వేజంక్షన్ లో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఉద్యాన్ ఎక్స్ప్రెస్ను ఢాకా నుంచి వస్తున్న రైలు ఢీకొనడంతో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బ్రహ్మన్ బరియా జనరల్ ఆసుపత్రి, కుమిల్లా సదర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన రైలు బోగీలను రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







