దొంగల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష

- November 13, 2019 , by Maagulf
దొంగల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష

బహ్రెయిన్‌: హై క్రిమినల్‌ కోర్టు ముగ్గురు వ్యక్తులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మరో వ్యక్తికి ఏడాది శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో ఓ మహిళ కూడా వున్నారు. అయితే, దొంగతనాల్లో మహిళ పాత్రపై ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం కలిగింది. నిందితులు ఇళ్ళలోకి దొంగతనంగా చొరబడి, విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సుమారు 50,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు నిందితులపై కేసు నమోదయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com