'రొమాంటిక్' సెట్లో అడుగుపెట్టిన రమ్యకృష్ణ
- November 17, 2019టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రొమాంటిక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్ళడం జరిగింది. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతుండగా, నరేష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ లో భాగంగా ఒక పిక్ బయటపడింది. ఇందులో రమ్యకృష్ణ మరియు ఛార్మి మాట్లాడుకుంటున్నారు. ఛార్మి నిర్మాతగా మారడంతో ఆమె రమ్యకృష్ణనకు కొన్ని సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!