బలపరీక్షలో నెగ్గిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం
- November 30, 2019
మహారాష్ట్ర:శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే అసెంబ్లీలో సులభంగా మెజారిటీ నిరూపించుకున్నారు. 169 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బలపరీక్ష సజావుగా ముగిసింది. ప్రొటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ మొదట మూజువాణీ ఓటుకు, ఆ తరువాత ఎమ్మెల్యేల వారీగా (హెడ్ కౌంట్) సభ్యుల లెక్కింపునకు ఆదేశించారు. (మెజారిటీ నిరూపణకు 145 మంది సభ్యుల సపోర్ట్ ఉంటే సరిపోతుంది). అయితే ఇంతకన్నా ఎక్కువమంది ఎమ్మెల్యేలే ఉధ్ధవ్ సర్కార్ కు తమ మద్దతు ప్రకటించారు. 119 మంది గైర్ హాజరయ్యారు. అంతకుముందు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఈ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంతో ఉధ్ధవ్ బల పరీక్ష సునాయాసమైంది. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్.. ప్రొటెమ్ స్పీకర్ గా ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే నియామకం సరికాదన్నారు. సభలో ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా రాజ్యాంగ నిబంధనలనన్నింటినీ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. అసలు ఈ అసెంబ్లీ సెషన్ ని ఏర్పాటు చేయడమే ప్రొసీజర్ ప్రకారం జరగలేదని, దిలీప్ వాల్సే నియామకం పూర్తిగా నిబంధనల అతిక్రమణేనని ఆయన దుయ్యబట్టారు. ఉధ్ధవ్ మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా సరిగా జరగలేదని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. అసలు స్పీకర్ ఎన్నిక తరువాత బలపరీక్షను నిర్వహించాల్సి ఉండిందని పేర్కొన్నారు. మొదట సభలో కూడా ఆయన ఇవే ఆరోపణలు చేసినప్పటికీ.. ప్రొటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే వాటిని తోసిపుచ్చుతూ.. ఫ్లోర్ టెస్టుకు ఆదేశించారు. కాగా-గురువారం సాయంత్రం ఉధ్ధవ్ థాక్రేతో బాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







