సౌదీకి ఆయుధ విక్రయాల నిలిపివేత..లేబర్ పార్టీ నేత జెరిమీ కార్బిన్ ప్రకటన
- December 04, 2019
లండన్: ఈ నెల 12న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే ప్రస్తుతం యెమెన్పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని స్మశానంగా మారుస్తున్న సౌదీకి ఆయుధ విక్రయాలను నిలిపివేస్తామని బ్రిటన్ లేబర్పార్టీ నేత జెరిమీ కార్బిన్ ప్రకటించారు. ఎన్నికల ముందు లేబర్ పార్టీ అనుసరించే విదేశాంగ విధాన లక్ష్యాలను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ యెమెన్పై ప్రస్తుతం కొనసాగుతున్న పోరుకు తెరదించే విధంగా సౌదీని కట్టడి చేసేందుకు ఆ దేశానికి ఆయుధ విక్రయాలను తాము నిలిపివేస్తామని చెప్పారు. సౌదీకి మద్దతుగా ప్రస్తుత కన్జర్వేటివ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తాము సమర్ధించబోమని ఆయన స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనుసరించే కొత్త అంతర్జాతీయ విధానంలో తాము 40 కోట్ల పౌండ్ల పెట్టుబడితో యుద్ధ నివారణ, శాంతి నిధిని ఏర్పాటుచేస్తామని చెప్పారు. యెమెన్, ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలలో కొనసాగుతున్న సాయుధ ఘర్షణలకు ఆజ్యం పోయకుండా తాము ఆయుధ ఎగుమతులను కట్టడి చేస్తామని, ఇందుకు అనుగుణంగా తాము దౌత్య సామర్ధ్యాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఆయుధ విక్రయాలలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, చైనాల తరువాత బ్రిటన్ ప్రపంచంలో ఆరోస్థానంలో నిలిచినట్లు స్టాకహేోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడయింది.
తాజా వార్తలు
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా









