'వైఎస్సార్ లా నేస్తం' ప్రారంభించిన ఏ.పి సీఎం
- December 03, 2019
అమరావతి: జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ లా నేస్తం వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. 2016 తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఈపథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇవ్వడంపై ముఖ్యమంత్రికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరుచేయడంపై కూడా న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!