'వైఎస్సార్ లా నేస్తం' ప్రారంభించిన ఏ.పి సీఎం
- December 03, 2019
అమరావతి: జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ లా నేస్తం వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. 2016 తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఈపథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇవ్వడంపై ముఖ్యమంత్రికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరుచేయడంపై కూడా న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







