'వైఎస్సార్ లా నేస్తం' ప్రారంభించిన ఏ.పి సీఎం
- December 03, 2019
అమరావతి: జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ లా నేస్తం వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. 2016 తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఈపథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇవ్వడంపై ముఖ్యమంత్రికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరుచేయడంపై కూడా న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా









