దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై 'సజ్జనార్ ' వివరణ
- December 06, 2019
హైదరాబాద్:దిశ హత్య కేసు నిందితులను శుక్రవారం ఉదయం చటాన్పల్లి దగ్గర ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఎన్ కౌంటర్ ఎలా జరిగింది..ఎన్ని గంటలకు జరిగింది..ఎంత మంది పోలీసుల ఆధ్వర్యంలో జరిగిందనే వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
ఆయన తెలిపిన ప్రకారం..బాధితురాలి వాచ్, సెల్ఫోన్ గురించి చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులను చటాన్పల్లికి తీసుకువచ్చాం. సెల్ఫోన్ అక్కడ, ఇక్కడ పెట్టామని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే పోలీసులపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేయడం జరిగింది. పోలీసుల వద్ద ఉన్న రెండు ఆయుధాలను నిందితులు లాక్కొని ఫైరింగ్కు యత్నించారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదు. పలుమార్లు హెచ్చరించిన తర్వాతే ఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైర్ చేశారు పోలీసులు.
కరుడుగట్టిన నేరస్తులు వీళ్లు. ఏ1 ఆరిఫ్ పాషా, ఏ4 చెన్నకేశవులు వద్ద రెండు ఆయుధాలను రికవరీ చేశాం. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించాం. అనంతరం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించాం. నిందితుల దాడిలో పోలీసుల తలకు గాయాలయ్యాయి అని తెలిపారు. మొత్తం పది మంది ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









