దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై 'సజ్జనార్ ' వివరణ
- December 06, 2019
హైదరాబాద్:దిశ హత్య కేసు నిందితులను శుక్రవారం ఉదయం చటాన్పల్లి దగ్గర ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఎన్ కౌంటర్ ఎలా జరిగింది..ఎన్ని గంటలకు జరిగింది..ఎంత మంది పోలీసుల ఆధ్వర్యంలో జరిగిందనే వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
ఆయన తెలిపిన ప్రకారం..బాధితురాలి వాచ్, సెల్ఫోన్ గురించి చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులను చటాన్పల్లికి తీసుకువచ్చాం. సెల్ఫోన్ అక్కడ, ఇక్కడ పెట్టామని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే పోలీసులపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేయడం జరిగింది. పోలీసుల వద్ద ఉన్న రెండు ఆయుధాలను నిందితులు లాక్కొని ఫైరింగ్కు యత్నించారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదు. పలుమార్లు హెచ్చరించిన తర్వాతే ఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైర్ చేశారు పోలీసులు.
కరుడుగట్టిన నేరస్తులు వీళ్లు. ఏ1 ఆరిఫ్ పాషా, ఏ4 చెన్నకేశవులు వద్ద రెండు ఆయుధాలను రికవరీ చేశాం. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించాం. అనంతరం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించాం. నిందితుల దాడిలో పోలీసుల తలకు గాయాలయ్యాయి అని తెలిపారు. మొత్తం పది మంది ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా