భారత వలసదారులకి పాస్పోర్ట్ ఇబ్బందులు
- January 14, 2016
వింటర్ బ్రేక్లో భాగంగా స్వదేశానికి వెళ్ళాలనుకుంటున్న భారతదేశానికి చెందిన యూఏఈలోని వలసదారులకు పాస్పోర్ట్ ఇబ్బందులు తప్పడంలేదు. పాస్పోర్ట్ రెన్యువల్ కోసం 2015, సెప్టెంబర్ 5న దరఖాస్తు చేసుకున్నా, అది ఇప్పటిదాకా జరగలేదని అబ్దుల్ గఫూర్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యూఏఈలోని భారత రాయబారి మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టి పారేశారు. పాస్పోర్టుల జారీలో ఎలాంటి ఆలస్యం జరగడంలేదని విమవరించారు. అయితే మలేసియా వెళ్ళాలనుకున్న తనకు తన భార్య పాస్పోర్ట్ ప్రాసెస్ కాకపోవడంతో వెళ్ళడం కుదరలేదని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో తత్కాల్ పాస్పోర్టులకూ సమస్యలు తప్పడంలేదు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తున్నామనీ, కొన్ని సాంకేతిక కారణాలు, క్లియరెన్స్ ఇబ్బందుల వల్ల చాలా తక్కువ సందర్భాల్లోనే పాస్పోర్టుల జారీలో సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







