'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఫిక్స్
- December 15, 2019
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారి మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి చాలా రోజుల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు,
అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే రెండు సాంగ్స్ మరియు టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు అనిల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 2020 జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన ను రిలీజ్ చేసింది. ఇక ఈన్యూస్ బయటకు రాగానే మహెష్ ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టేశారు.
ఈ సినిమాలోని మూడవ పాటను రేపు సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా థియేట్రికల్ ట్రైలర్ ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్ లతో మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









