తెదేపాలో చేరిన జయసుధ
- January 16, 2016
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సికిందరాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటి అయిన జయసుధ శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం నాడు విజయవాడ వచ్చిన ఆమె చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ప్రజలు ఎన్నుకోవడం దైవనిర్ణయమని చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి చాలాకాలం నుంచి దూరంగా ఉన్నానన్నారు. ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పారు. కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన జయసుధ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







