'తెలుగు తరంగిణి' సంక్రాంతి సంబరాలు
- January 17, 2016
రాస్ అల్ ఖైమాలో తెలుగు తరంగిణి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నిమిషాలకు ప్రార్ధన, స్వాగత సందేశంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.సంప్రదాయం దుబాయి వారి సౌజన్యంతో శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం, సామూహిక విష్ణు సహస్ర నామార్చన కన్నుల పండుగగా నిర్వహించబడింది.మధ్యాహ్నం చిన్న పిల్లలకు భోగిపళ్ళు, ఆశీర్వచనం, బొమ్మల కొలువు నిర్వహించారు. హరిదాసుల సందడి, మహిళల రంగ వల్లులు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించారు.నిర్వాహకులు రాస్ అల్ ఖైమాలో పల్లెటూరు వాతావరణాన్ని నెలకొల్పారు. సాయంత్రం 4 గంటలకు తంబోలా ఆట సరదా సరదాగా సాగింది తరువాత వివిధ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతుల్ని అందజేశారు. థ్యాంక్స్ మీట్తో ఈకార్యక్రమాలు ముగిశాయి. సంప్రదాయ విందు భోజనం, సాయంత్రం 4.30 నిమిషాలకు స్నాక్స్ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ సురేష్ గారు, ఎక్షిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ గారు, సెక్రెటరి నందా గారు, ట్రషరర్ రాజేష్ గారు మరియు తరంగిణి సభ్యులు అందరూ కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు సుజన్ గారు, మైథిలి గారు ఏంకర్లుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారం అందించింది.మాగల్ఫ్.కామ్ టీం తరపున 'తెలుగు తరంగిణి టీం' కు అభినందనలు.







తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







