వరుస సినిమాలతో హీరోయిన్ రాశి సింగ్ బిజీ బిజీ
- January 11, 2020
పోస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన భామ రాశి సింగ్. తన తొలి సినిమాతోనే తెలుగు మాట్లాడటం నేర్చుకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆది సాయి కుమార్ తో ఒక సినిమా, దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ మరియు అరవింద్ కృష్ణ లు హీరోలుగా ఒక సినిమా, శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జెమ్ అనే సినిమాలో నటిస్తూ మరికొన్ని సినిమాలకు కథలు వింటున్నా అని చెప్పుకొచ్చింది ఈ ఛతీస్ ఘడ్ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు తెలుగు మాట్లాడుతుండటం తో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ కలిగి ఉండటం వలన ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా ఒకే అంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏది ఏమైనా హీరోయిన్స్ కి తెలుగు మాట్లాడటం వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పుష్కలంగా వస్తాయని హీరోయిన్ రాశి సింగ్ మరోసారి నిరూపించింది.ఈ అమ్మడు నటించిన సినిమా పోస్టర్ అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







