చిరంజీవి 150వ సినిమా తొలి షెడ్యూల్ మార్చి లేదా ఏప్రిల్ లో..
- January 18, 2016
మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్.తొలిసారిగా వివి వినాయక్ ఈ సినిమా గురించి నోరు విప్పారు. మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా తొలి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చిరంజీవితో చేస్తున్ తెలుగు వెర్షన్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా హాట్ టాపిక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. ఆమె అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుందని భావిస్తున్నారట. ఫ్యాన్స్ కూడా నయనతార ఎంపికపై సంతృప్తిగానే ఉన్నారు.మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ సినిమాకు చిరంజీవి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విషయమై చర్చించి రూ. 30 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రూ. 15 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







