సౌదీలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
- January 17, 2020తెలంగాణ:సౌదీ అరేబియా దేశంలో చిక్కుకున్న తమ వారిని ఇండియాకు వాపస్ తెప్పించాలని జగిత్యాల మండలానికి చెందిన రెండు కుటుంబాల వారు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని కలిసి కోరగా, ఆయన సూచన మేరకు వారు శుక్రవారం (17.01.2020) జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన నక్క వేణు, జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్ పేట కు చెందిన గోనెల వెంకటి ఉపాధి నిమిత్తం ఆరేళ్ళ క్రితం సౌదీ అరేబియాకు లోని అభా ఖమీస్ ముషాయత్ ప్రాంతానికి వెళ్లారు.
యజమాని వారి గుర్తింపు కార్డులను లాక్కున్నాడని, యజమాని సోదరులు డిసెంబర్ 14 న దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నక్క వేణు, గోనెల వెంకటి సౌదీ లోని జిద్దా ఇండియన్ కాన్సులేట్ లో, లేబర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఒక్కొక్కరు 9 వేల సౌదీ రియాల్స్ చెలిస్తేనే దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి (ఎగ్జిట్ పర్మిట్) ఇస్తానని యజమాని డిమాండ్ చేస్తున్నాడని వారు తెలిపారు.
నక్క వేణు తండ్రి భూమయ్య,గోనెల వెంకటి భార్య మల్లేశ్వరి లు లక్ష్మీపూర్ కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు తిరుపతి రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లాల జయపాల్ లతో కలిసి జిల్లా కలెక్టరు కు వినతి పత్రం సమర్పించారు.
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్