అస్సాం ప్రజల కలలు సాకారంకు తాము సహకరిస్స్తాం : మోదీ
- January 19, 2016
అస్సాం ప్రజల కలలు సాకారమయ్యేందుకు తాము సహకరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం అస్సాం పర్యటనలో ఉన్న ఆయన కోక్రాఝార్లో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోక్రాఝార్కి ఏడాదిలోగా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు రూటును పొడిగిస్తామన్నారు. తొందరలోనే భారత వైమానిక దళం, పౌరులు వాడుకునేందుకు వీలుగా అక్కడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శల వర్షం కురిపించారు. గత పదిహేనేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. వారు అంత కాలంలో చేయలేని పనిని తాము 15 నెలల్లో చేసి చూపించామని చెప్పారు. దిల్లీ ఒక రూపాయి పంపిస్తుంటే 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుతోందని రాజీవ్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అస్సాం ప్రభుత్వం మాత్రం తాము చేసే ప్రతి పనికీ లెక్కలు చూపుతోందని పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అస్సాం కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక పథకం 'అభివృద్ధి' అని పేర్కొన్నారు. అక్కడ రోడ్డు, రైలు, వాయు మార్గాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









