పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది
- January 19, 2016
పీఎస్ఎల్వీ సీ-31 ప్రయోగం వి జయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈరోజు ఉదయం 9.31గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ31(పీఎస్ఎల్వీ) వాహక నౌకను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమై 48గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన పిదప పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్ ఎన్ఎస్ఎస్-1ఇ ఉప గ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ31 వాహకనౌక 19 నిమిషాల 30సెకన్లలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2016 తొలి అంకంలో ఇస్రో సాధించిన ఘన విజయమని శాస్రవేత్తలు ప్రకటించారు. పీఎస్ఎల్వీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్దిందని పేర్కొన్నారు. మరో రెండున్న నెలల్లో మిగతా 2 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని తెలిపారు. 2016 చివరినాటికి స్వదేశీ దిక్చూచిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్(జీపీఎస్)కు మరింత వూతం లభించనుంది. భూ స్థిర కక్ష్యకు 36వేల కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని రోదసీలో నిలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







