వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' దిగితే దుబాయ్ లో 200 దిర్హమ్స్ జరిమానా
- January 21, 2016
ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ...విలాసంగా కారు నడుపుతూ తమలో తామే మురిసిపోతూ చిరునవ్వు క్షణాల్లో పులుముకొని తమ ఫోటో కోసం ఎదుటవారి ఫోటోకు దండ వేయించే ' సేల్ఫీలు ' దిగేపరమానందలయ్యాల పని దుబాయ్ పోలీసులు ఇక పట్టనున్నారు వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు 'దిగితే దుబాయ్ లో 200 దినార్ల జరిమానాతో పాటు లైసెన్స్ పై నాలుగు నల్ల చుక్కలు పెడతారు. దీంతోకొంత కాలం డ్రైవింగ్ సంగతిని సదరు ఆ వాహన చోదకుడు మర్చిపోవాల్సిందే. తాను నడుపుతున్నవాహనం ద్వారా మరొకరికి అసౌకర్యం కలిగించకూడదనే ఒక మంచి భావన అలవార్చుకోవాలన్నారు. వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీస్తూ, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక ఎదుటి వారినిసైతం చంపివేస్తున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని దుబాయ్ పోలీసులువివరిస్తున్నారు. వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం , సంక్షీప్త సమాచారంను ఫోన్లో చదవడం , ' సేల్ఫీలు ' తీయడం చట్ట ఉల్లంఘన నేరంగా నమోదు చేస్తారు. ఈ చర్యలు వాహనచోధకునిఏకాగ్రతను దెబ్బ తీయగలవని వారు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









