వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' దిగితే దుబాయ్ లో 200 దిర్హమ్స్ జరిమానా
- January 21, 2016
ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ...విలాసంగా కారు నడుపుతూ తమలో తామే మురిసిపోతూ చిరునవ్వు క్షణాల్లో పులుముకొని తమ ఫోటో కోసం ఎదుటవారి ఫోటోకు దండ వేయించే ' సేల్ఫీలు ' దిగేపరమానందలయ్యాల పని దుబాయ్ పోలీసులు ఇక పట్టనున్నారు వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు 'దిగితే దుబాయ్ లో 200 దినార్ల జరిమానాతో పాటు లైసెన్స్ పై నాలుగు నల్ల చుక్కలు పెడతారు. దీంతోకొంత కాలం డ్రైవింగ్ సంగతిని సదరు ఆ వాహన చోదకుడు మర్చిపోవాల్సిందే. తాను నడుపుతున్నవాహనం ద్వారా మరొకరికి అసౌకర్యం కలిగించకూడదనే ఒక మంచి భావన అలవార్చుకోవాలన్నారు. వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీస్తూ, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక ఎదుటి వారినిసైతం చంపివేస్తున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని దుబాయ్ పోలీసులువివరిస్తున్నారు. వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం , సంక్షీప్త సమాచారంను ఫోన్లో చదవడం , ' సేల్ఫీలు ' తీయడం చట్ట ఉల్లంఘన నేరంగా నమోదు చేస్తారు. ఈ చర్యలు వాహనచోధకునిఏకాగ్రతను దెబ్బ తీయగలవని వారు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







