యూరోలు, దిరామ్స్ని కలిగిన ఓ వ్యక్తి అరెస్ట్..
- January 21, 2016
పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కలిగిన ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రూ. కోటి విలువ గల విదేశీ కరెన్సీ(యూరోలు, దిరామ్స్)ని కలిగిన ఓ వ్యక్తి ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఇంటలిజెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. కాగా కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి తన వెంట 5 వేల యూఎస్ డాలర్స్ను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. వీటితో పాటు మరో 5 వేల డాలర్ల విలువ గల బాండ్లు, చెక్స్ను తీసుకువెళ్లవచ్చు. పరిమితికి మించి నగదును తీసుకువెళ్తుండటంతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







