జుమైరా విలేజ్ సర్కిల్కి మూడు కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్
- January 21, 2016
జుమైరా విలేజ్ సర్కిల్ (జెవిసి) రిసిడెంట్స్, నఖీల్ కొత్తగా అమల్లోకి తెచ్చిన మూడు కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ని స్వాగతించారు. మాస్టర్ డెవలపర్ నఖీల్ మాట్లాడుతూ, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి, మూడు యాక్సెస్ పాయింట్స్ని ఏర్పాటు చేయడానికి యూఏఈకి చెందిన డిఎక్స్ కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సి మరియు నేషనల్ గల్ఫ్ కన్స్ట్రక్షన్స్ ఎల్ఎల్సి సంయుక్తంగా ముందుకొచ్చినట్లు చెప్పారు. దుబాయ్లో అతి వేగంగా విస్తరిస్తున్న కమ్యూనిటీస్లో జెవిసి ఒకటి. అల్ ఖైల్ రోడ్ మరియు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లో ఈ కమ్యూనిటీ నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోంది. 18.5 మిలియన్ దిర్హామ్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. మూడో త్రైమాసికానికి ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









