కువైట్ లో ఇక ఆదాయం.. అమ్మకం పన్నులు

- January 21, 2016 , by Maagulf
కువైట్ లో ఇక  ఆదాయం.. అమ్మకం పన్నులు

అంతర్జాతీయంగా చమురు ఆదాయాలు పతనం కావడంతో ఇంధన మరియు శక్తి పై  ఇచ్చే భారీ రాయతీలను తగ్గించనున్నట్లు కువైట్ ఎమిర్ షేఖ్ సబహ్ అహ్మద్ అల్ సబహ్ చెప్పారు. రాయతీలు   ఎత్తివేయడంతో పెట్రోల్, విద్యుత్, నీటి ధరలు పెరగనున్నట్లు తెలిపారు. ఇతర సేవల కొరకు రాయతీలను తగ్గించేందుకు  ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన కువైట్ స్థానిక దిన పత్రికలకు ఈ సమాచారం తెలిపారు. 6 దేశాల గల్ఫ్ దేశాల సమాఖ్యలో కువైట్ దేశం మాత్రమె ఇప్పటి వరుకు పెట్రోల్, విద్యుత్ పై  ధరలు పెంచాలేదనే విషయం గ్రహించాలని అన్నారు. సౌదీ అరేబియా, యు.ఎ.ఇ. ఖతర్, ఒమాన్  ,బహేరిన్  దేశాలు పెట్రోల్, విద్యుత్ ధరలు సరెళీకరణ చేయడం ద్వారా బిలియన్ల కొద్ది డాలర్లను ఆదా చేసినట్లు తెలిపారు.తాము సైతం తప్పని పరిస్థితులలో ధరలను పెంచేందుకు యత్నిస్తున్నట్లు ఎమిర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంత్రి ఆల్ సలెహ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాము ఇక  ప్రజా సేవల వ్యయాన్ని పెంచి , ప్రభుత్వం ఇచ్చే రాయతీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు, 
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com