రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 24మంది మృతి
- February 26, 2020
రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 24 మంది చనిపోయారు. బూండీలోని కోట లాల్సాత్ మెగా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల కోసం వరుడి కుటుంబం, బంధువులతో కలిసి.. కోట నుంచి సవాయ్మాధోపూర్ వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు 24 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







