నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

- March 02, 2020 , by Maagulf
నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: పాటియాలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించేది లేదని తేల్చి చెప్పింది. స్టే విధించాలన్న పవన్ కుమార్, అక్షయ్ సింగ్‌ల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

మార్చి 03న నిర్భయ దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తెలిసిందే. రేపు ఉదయం 6 గంటలకే దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే ఢిల్లీ కోర్టు, సుప్రీం కోర్టుల్లో నిందితులు పిటిషన్లు వేశారు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సుప్రీం కోర్టులో పవన్‌గుప్తా పిటిషన్‌ వేయగా.. క్యూరేటివ్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.

అలాగే తమ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ పవన్ కుమార్, అక్షయ్ సింగ్ పాటియాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఉరిశిక్ష అమలుపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. దోషులకు రేపు ఉరి అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే పాటియాల కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com