నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
- March 02, 2020
న్యూఢిల్లీ: పాటియాలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించేది లేదని తేల్చి చెప్పింది. స్టే విధించాలన్న పవన్ కుమార్, అక్షయ్ సింగ్ల పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
మార్చి 03న నిర్భయ దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తెలిసిందే. రేపు ఉదయం 6 గంటలకే దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే ఢిల్లీ కోర్టు, సుప్రీం కోర్టుల్లో నిందితులు పిటిషన్లు వేశారు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సుప్రీం కోర్టులో పవన్గుప్తా పిటిషన్ వేయగా.. క్యూరేటివ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.
అలాగే తమ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని.. డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ పవన్ కుమార్, అక్షయ్ సింగ్ పాటియాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఉరిశిక్ష అమలుపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. దోషులకు రేపు ఉరి అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే పాటియాల కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







