ఇన్బౌండ్ ట్రావెలర్స్పై ఒమన్ ఆంక్షలు
- March 03, 2020
మస్కట్:కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ (ఎంఓఎఫ్ఎ), ఇన్బౌండ్ ట్రావెలర్స్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ని జారీ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మినిస్ట్రీ, కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఒమన్లోకి ప్రవేశం ఇవ్వకూడదన్నది ఆ నిర్ణయాల్లో ఒకటి. వాయు మార్గంలోగానీ, జల మార్గంలోగానీ, రోడ్డు మార్గంలోగానీ వచ్చేవారిని ఒమన్లోకి అనుమతించరు. కాగా, జపాన్ మరియు సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణీకులకు మినహాయింపునిచ్చారు. చైనా, ఇరాన్, సౌత్ కొరియా మరియు ఇటలీ నుంచి వచ్చేవారిపై నిషేధం కొనసాగిస్తున్నారు. చైనాకి డైరెక్ట్ విమానాల్ని అలాగే ఇరాన్కి డైరెక్ట్ విమానాల్ని రద్దు చేశారు. ఇటలీ నుంచి చార్టర్డ్ టూరిజం విమానాలకీ అనుమతులు రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







