ఇన్బౌండ్ ట్రావెలర్స్పై ఒమన్ ఆంక్షలు
- March 03, 2020
మస్కట్:కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ (ఎంఓఎఫ్ఎ), ఇన్బౌండ్ ట్రావెలర్స్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ని జారీ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మినిస్ట్రీ, కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఒమన్లోకి ప్రవేశం ఇవ్వకూడదన్నది ఆ నిర్ణయాల్లో ఒకటి. వాయు మార్గంలోగానీ, జల మార్గంలోగానీ, రోడ్డు మార్గంలోగానీ వచ్చేవారిని ఒమన్లోకి అనుమతించరు. కాగా, జపాన్ మరియు సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణీకులకు మినహాయింపునిచ్చారు. చైనా, ఇరాన్, సౌత్ కొరియా మరియు ఇటలీ నుంచి వచ్చేవారిపై నిషేధం కొనసాగిస్తున్నారు. చైనాకి డైరెక్ట్ విమానాల్ని అలాగే ఇరాన్కి డైరెక్ట్ విమానాల్ని రద్దు చేశారు. ఇటలీ నుంచి చార్టర్డ్ టూరిజం విమానాలకీ అనుమతులు రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







