దోహా:ఓ ఐడియాతో దోహా మెట్రో కార్డ్స్ కు పెరిగిన డిమాండ్
- March 03, 2020
దోహా మెట్రో రైల్ సర్వీసులో పేపర్ టికెట్ల యూసేజ్ ను భారీగా తగ్గించేందుకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్షన్ లో భాగంగా గత నెల 20న పేపర్ టికెట్లపై ధరలను పెంచింది దోహా మెట్రో రైల్వే. ఫిబ్రవరి 20కి ముందున్న 2QR ఉన్న టికెట్ ధరను 3QRకు పెంచింది. అలాగే 6QRగా ఉన్న రోజు వారి పాస్ ధర 10QR కు పెంచింది. జర్నీగోల్డ్ క్లాస్ టికెట్ రేటు 10QR నుంచి 15QRకి, 30QRగా ఉన్న గోల్డ్ క్లాస్ ఒక రోజు పాస్ రేటును 45QRకు పెంచారు. ఫిబ్రవరి 21 నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే..మెట్రో కార్డ్స్ రేట్లను మాత్రం పెంచలేదు. మెట్రోలో పేపర్ టికెట్లను తగ్గించే లక్ష్యంతో దోహా మెట్రో ఈ చర్యలు చేపట్టింది. దోహా మెట్రో చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. పేపర్ టికెట్ల రేట్లు పెరిగినప్పటి నుంచి మెట్రో కార్డ్స్ కు డిమాండ్ పెరిగింది. గత వారం రోజులుగా ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. ఒక్కో వ్యక్తి రెండు, మూడు కార్డులు తీసుకుంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మెట్రో కార్డులు కొంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







