దోహా:ఓ ఐడియాతో దోహా మెట్రో కార్డ్స్ కు పెరిగిన డిమాండ్
- March 03, 2020
దోహా మెట్రో రైల్ సర్వీసులో పేపర్ టికెట్ల యూసేజ్ ను భారీగా తగ్గించేందుకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్షన్ లో భాగంగా గత నెల 20న పేపర్ టికెట్లపై ధరలను పెంచింది దోహా మెట్రో రైల్వే. ఫిబ్రవరి 20కి ముందున్న 2QR ఉన్న టికెట్ ధరను 3QRకు పెంచింది. అలాగే 6QRగా ఉన్న రోజు వారి పాస్ ధర 10QR కు పెంచింది. జర్నీగోల్డ్ క్లాస్ టికెట్ రేటు 10QR నుంచి 15QRకి, 30QRగా ఉన్న గోల్డ్ క్లాస్ ఒక రోజు పాస్ రేటును 45QRకు పెంచారు. ఫిబ్రవరి 21 నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే..మెట్రో కార్డ్స్ రేట్లను మాత్రం పెంచలేదు. మెట్రోలో పేపర్ టికెట్లను తగ్గించే లక్ష్యంతో దోహా మెట్రో ఈ చర్యలు చేపట్టింది. దోహా మెట్రో చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. పేపర్ టికెట్ల రేట్లు పెరిగినప్పటి నుంచి మెట్రో కార్డ్స్ కు డిమాండ్ పెరిగింది. గత వారం రోజులుగా ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. ఒక్కో వ్యక్తి రెండు, మూడు కార్డులు తీసుకుంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మెట్రో కార్డులు కొంటున్నారని దోహా మెట్రో అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







