దుబాయ్ : స్పెషల్ లోగోతో 4 నెలల్లో మిలియన్ వీసాల జారీ..దుబాయ్ బ్రాండ్ పెంచటమే టార్గెట్
- March 08, 2020గల్ఫ్ కంట్రీస్ తో పాటు వరల్డ్ వైడ్ గా దుబాయ్ బ్రాండ్ ను పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా థింక్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగోతో వీసాలను జారీ చేసింది. గత నాలుగు నెలల్లోనే లోగోతో కూడిన పది లక్షల వీసాలను జారీ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారనర్స్ అఫైర్స్ (GDRFA-Dubai) ప్రకటించింది. 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగో ద్వారా గల్ఫ్ కంట్రీస్ లో మీడియా వరల్డ్ లో దుబాయ్ లీడర్ షిప్ ను చాటి చెప్పింది. అలాగే రీజినల్ గా మీడియా ఇండస్ట్రీ గ్రోత్ కు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది. అయితే..యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విజన్ మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ నుంచి దుబాయ్ కి ఉన్న గుర్తింపు హైలెట్ చేయటం తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. దాంతో పెట్టుబడులు రావటంతో పాటు దుబాయ్ టూరిజమ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకునే వీలుంటుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..