దుబాయ్ : స్పెషల్ లోగోతో 4 నెలల్లో మిలియన్ వీసాల జారీ..దుబాయ్ బ్రాండ్ పెంచటమే టార్గెట్
- March 08, 2020
గల్ఫ్ కంట్రీస్ తో పాటు వరల్డ్ వైడ్ గా దుబాయ్ బ్రాండ్ ను పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా థింక్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగోతో వీసాలను జారీ చేసింది. గత నాలుగు నెలల్లోనే లోగోతో కూడిన పది లక్షల వీసాలను జారీ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారనర్స్ అఫైర్స్ (GDRFA-Dubai) ప్రకటించింది. 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగో ద్వారా గల్ఫ్ కంట్రీస్ లో మీడియా వరల్డ్ లో దుబాయ్ లీడర్ షిప్ ను చాటి చెప్పింది. అలాగే రీజినల్ గా మీడియా ఇండస్ట్రీ గ్రోత్ కు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది. అయితే..యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విజన్ మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ నుంచి దుబాయ్ కి ఉన్న గుర్తింపు హైలెట్ చేయటం తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. దాంతో పెట్టుబడులు రావటంతో పాటు దుబాయ్ టూరిజమ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకునే వీలుంటుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







