దుబాయ్ : స్పెషల్ లోగోతో 4 నెలల్లో మిలియన్ వీసాల జారీ..దుబాయ్ బ్రాండ్ పెంచటమే టార్గెట్
- March 08, 2020
గల్ఫ్ కంట్రీస్ తో పాటు వరల్డ్ వైడ్ గా దుబాయ్ బ్రాండ్ ను పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా థింక్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగోతో వీసాలను జారీ చేసింది. గత నాలుగు నెలల్లోనే లోగోతో కూడిన పది లక్షల వీసాలను జారీ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారనర్స్ అఫైర్స్ (GDRFA-Dubai) ప్రకటించింది. 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగో ద్వారా గల్ఫ్ కంట్రీస్ లో మీడియా వరల్డ్ లో దుబాయ్ లీడర్ షిప్ ను చాటి చెప్పింది. అలాగే రీజినల్ గా మీడియా ఇండస్ట్రీ గ్రోత్ కు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది. అయితే..యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విజన్ మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ నుంచి దుబాయ్ కి ఉన్న గుర్తింపు హైలెట్ చేయటం తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. దాంతో పెట్టుబడులు రావటంతో పాటు దుబాయ్ టూరిజమ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకునే వీలుంటుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







