దుబాయ్ : స్పెషల్ లోగోతో 4 నెలల్లో మిలియన్ వీసాల జారీ..దుబాయ్ బ్రాండ్ పెంచటమే టార్గెట్
- March 08, 2020
గల్ఫ్ కంట్రీస్ తో పాటు వరల్డ్ వైడ్ గా దుబాయ్ బ్రాండ్ ను పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా థింక్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగోతో వీసాలను జారీ చేసింది. గత నాలుగు నెలల్లోనే లోగోతో కూడిన పది లక్షల వీసాలను జారీ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారనర్స్ అఫైర్స్ (GDRFA-Dubai) ప్రకటించింది. 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగో ద్వారా గల్ఫ్ కంట్రీస్ లో మీడియా వరల్డ్ లో దుబాయ్ లీడర్ షిప్ ను చాటి చెప్పింది. అలాగే రీజినల్ గా మీడియా ఇండస్ట్రీ గ్రోత్ కు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది. అయితే..యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విజన్ మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ నుంచి దుబాయ్ కి ఉన్న గుర్తింపు హైలెట్ చేయటం తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. దాంతో పెట్టుబడులు రావటంతో పాటు దుబాయ్ టూరిజమ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకునే వీలుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు