దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...మృతిచెందిన తెలంగాణకు చెందిన కార్మికుడు
- March 11, 2020
దుబాయ్: జగిత్యాల జిల్లా, కతలాపూర్ మండలం, అంబారిపేట్ గ్రామానికి చెందిన కొత్తపెల్లి అజయ్ కుమార్ (23) అనే యువకుడు గత గురువారం రోజున తన స్నేహితుని దగ్గరికి వెళ్లి శుక్రవారం నాడు సాయంత్రం తన రూముకి తిరిగివస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో అనుకోకుండా కారు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.
సమాచారాన్ని మృతుని యొక్క తోటి కార్మికులు మరియు భందువులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ కి తెలపడంతో వెంటనే స్పందించి అన్ని ఫార్మాలిటిస్ దగ్గరుండి పూర్తి చేయించి కంపెనీ పూర్తి సహకారంతో మృతదేహాన్ని ఈ రోజు ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.
"గల్ఫ్ అన్నలు దయచేసి రోడ్డు దాటుతున్న సమయంలో మరియు వాహనాలు నడుపుతున్న సమయాలల్లో చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యవహరించాల్సిందిగా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) తరుపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన T NRI పాలసీని వెంటనే అమలు చేయాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుండి వేడుకుంటున్నాము." అని గుండెల్లి నరసింహ కోరారు.

మృతి చెందిన అజయ్ కుమార్ ను స్వగ్రామం చేర్చేందుకు సహకరించినవారు: గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, విజయ్ కొత్తపల్లి, ఉప్పులుటి శ్రీనివాస్, ధూంపెట రవీందర్, మామిడిపల్లి నారాయణ, శనిగరపు భూమేష్ మధు, CH నాగరాజు,కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, పేంట రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి తదితరులు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







