దోహ:ఖతార్ లో ఒక్క రోజే 238 కరోనా కేసులు..అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్
- March 12, 2020
ఖతార్ లో కరోనా మహమ్మారి పడగ విప్పింది. ఒక్క రోజులోనే 238 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఖతార్ లో కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 262కు పెరిగింది. దీంతో ఖతార్ హెల్త్ మినిస్ట్రి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరింత క్లోజ్ మానిటర్ చేస్తోంది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందనే అభిప్రయానికి వచ్చింది. విదేశీ ప్రయాణికుల వల్లే వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ఇరాన్ తో పాటు కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజులు క్యారంటైన్ లో ఉండాల్సిందేనని సూచించింది. ఇదిలాఉంటే ఖతార్ లో వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఖతార్ కు అన్ని కమర్షియల్ ఫ్లైట్స్ ను రద్దు చేసింది. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ కానున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







