దోహ:ఖతార్ లో ఒక్క రోజే 238 కరోనా కేసులు..అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్

- March 12, 2020 , by Maagulf
దోహ:ఖతార్ లో ఒక్క రోజే 238 కరోనా కేసులు..అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్

ఖతార్ లో కరోనా మహమ్మారి పడగ విప్పింది. ఒక్క రోజులోనే 238 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఖతార్ లో కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 262కు పెరిగింది. దీంతో ఖతార్ హెల్త్ మినిస్ట్రి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరింత క్లోజ్ మానిటర్ చేస్తోంది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందనే అభిప్రయానికి వచ్చింది. విదేశీ ప్రయాణికుల వల్లే వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ఇరాన్ తో పాటు కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజులు క్యారంటైన్ లో ఉండాల్సిందేనని సూచించింది. ఇదిలాఉంటే ఖతార్ లో వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఖతార్ కు అన్ని కమర్షియల్ ఫ్లైట్స్ ను రద్దు చేసింది. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ కానున్నాయి.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com