దోహ:ఖతార్ లో ఒక్క రోజే 238 కరోనా కేసులు..అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్
- March 12, 2020
ఖతార్ లో కరోనా మహమ్మారి పడగ విప్పింది. ఒక్క రోజులోనే 238 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఖతార్ లో కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 262కు పెరిగింది. దీంతో ఖతార్ హెల్త్ మినిస్ట్రి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరింత క్లోజ్ మానిటర్ చేస్తోంది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందనే అభిప్రయానికి వచ్చింది. విదేశీ ప్రయాణికుల వల్లే వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ఇరాన్ తో పాటు కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజులు క్యారంటైన్ లో ఉండాల్సిందేనని సూచించింది. ఇదిలాఉంటే ఖతార్ లో వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఖతార్ కు అన్ని కమర్షియల్ ఫ్లైట్స్ ను రద్దు చేసింది. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ కానున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







