దోహాలో తాజాగా 17 కరోనా కేసులు
- March 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా 17 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 337కి పెరిగింది. క్వారంటీన్లో వున్న వలసదారుల్లో ఎవరికీ కరోనా పాజిటివ్గా తేలలేదని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది. కొత్త కేసుల్ని కంప్లీట్ ఐసోలేషన్కి తరలించామనీ, వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నారని, ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో వారంతా వున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, ఖతార్లో మొత్తం 5309 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అవసరమైన పరీక్షల నిమిత్తం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా అనుమానిత లక్షణాలు కలిగి వుంటే, స్వచ్చందంగా సమీపంలోని ఆసుపత్రుల్ని సందర్శించాలని సూచిస్తోంది మినిస్ట్రీ.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







