దోహాలో తాజాగా 17 కరోనా కేసులు
- March 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా 17 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 337కి పెరిగింది. క్వారంటీన్లో వున్న వలసదారుల్లో ఎవరికీ కరోనా పాజిటివ్గా తేలలేదని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది. కొత్త కేసుల్ని కంప్లీట్ ఐసోలేషన్కి తరలించామనీ, వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నారని, ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో వారంతా వున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, ఖతార్లో మొత్తం 5309 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అవసరమైన పరీక్షల నిమిత్తం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా అనుమానిత లక్షణాలు కలిగి వుంటే, స్వచ్చందంగా సమీపంలోని ఆసుపత్రుల్ని సందర్శించాలని సూచిస్తోంది మినిస్ట్రీ.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







