దోహాలో తాజాగా 17 కరోనా కేసులు
- March 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా 17 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 337కి పెరిగింది. క్వారంటీన్లో వున్న వలసదారుల్లో ఎవరికీ కరోనా పాజిటివ్గా తేలలేదని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది. కొత్త కేసుల్ని కంప్లీట్ ఐసోలేషన్కి తరలించామనీ, వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నారని, ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో వారంతా వున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, ఖతార్లో మొత్తం 5309 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అవసరమైన పరీక్షల నిమిత్తం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా అనుమానిత లక్షణాలు కలిగి వుంటే, స్వచ్చందంగా సమీపంలోని ఆసుపత్రుల్ని సందర్శించాలని సూచిస్తోంది మినిస్ట్రీ.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







