బహ్రెయిన్:లేబర్ క్యాంప్ లోని వర్కర్స్ కు కరోనా నెగటీవ్..
- March 14, 2020
బహ్రెయిన్:మనామలోని ఓ కంపెనీలోని లేబర్ క్యాంప్ లో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కార్మికులు ఎవరికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో మెడికల్ టీం, ఇతర అఫిషియల్ టీమ్స్ ఊపిరిపీల్చుకున్నాయి. కంపెనీ లేబర్స్ అందరికీ ఒకే చోట ఆకామిడేషన్ ఇవటంతో కరోనా వైరస్ సోకిన వ్యక్తితో వాళ్లంతా కాంటాక్ట్ లో ఉన్నారు. తోటి వ్యక్తికి వైరస్ సోకిందని తెలియటంతో మిగిలిన వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యింది. కంపెనీ లేబర్స్ ని బయటికి రానివ్వకుండా అందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు చేపట్టారు. అయితే..రిపోర్ట్స్ నెగటీవ్ రావటంతో అటు కంపెనీ యాజమాన్యం, కార్మికులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. మెడికల్ రిపోర్ట్స్ నెగటీవ్ వచ్చినా..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లేబర్స్ అందరు 14 రోజుల పాటు క్వారంటైన్ పాటించాల్సిందేనని ఆదేశించారు. కార్మికులను హెల్త్ కండీషన్ ను చెక్ చేసేందుకు స్పెషలైజ్డ్ మెడికల్ టీంను ఏర్పాటు చేశారు. దీంతో ఈ 14 రోజులు కార్మికులు అందరూ కంపెనీ తమకు కేటాయించిన అకామిడేషన్ గదుల నుంచి బయటికి రావాటానికి వీల్లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కంపెనీ యాజమాన్యం కూడా పూర్తి మద్దతుగా నిలబడింది. అంతేకాదు డ్యూటీలోకి రాకున్నా సాలరీల చెల్లింపులు యధావిధిగా కొనసాగిస్తామని ప్రకటించింది. క్వారంటైన్ సమయంలో కంపెనీ అకామిడేషన్ గదులను వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. కార్మికులు శ్రేయస్సు, ప్రభుత్వానికి మద్దతుగా కంపెనీ యాజమాన్యం చూపిన చొరవకు ప్రభుత్వం కూడా అభినందించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







