అబుదాబి, షార్జా, దుబాయ్కు విమానాలు రద్దు చేసిన ఇండిగో
- March 15, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 5 వేల 800 దాటింది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లో నిన్న కరోనాతో చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు బ్రిటన్ లో అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా సోకింది. భారత ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక స్థానికంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్.. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ.. ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల మార్చి 17వ తేదీ నుండి తదుపరి ఆదేశాల వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అబుదాబి, షార్జా, దుబాయ్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







