అబుదాబి, షార్జా, దుబాయ్కు విమానాలు రద్దు చేసిన ఇండిగో
- March 15, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 5 వేల 800 దాటింది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లో నిన్న కరోనాతో చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు బ్రిటన్ లో అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా సోకింది. భారత ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక స్థానికంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్.. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ.. ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల మార్చి 17వ తేదీ నుండి తదుపరి ఆదేశాల వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అబుదాబి, షార్జా, దుబాయ్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







