అబుదాబి, షార్జా, దుబాయ్కు విమానాలు రద్దు చేసిన ఇండిగో
- March 15, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 5 వేల 800 దాటింది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లో నిన్న కరోనాతో చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు బ్రిటన్ లో అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా సోకింది. భారత ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక స్థానికంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్.. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ.. ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల మార్చి 17వ తేదీ నుండి తదుపరి ఆదేశాల వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అబుదాబి, షార్జా, దుబాయ్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







