తెలంగాణలో మరో 3 కరోనా కేసులు పెరిగాయి..

- March 24, 2020 , by Maagulf
తెలంగాణలో మరో 3 కరోనా కేసులు పెరిగాయి..

కరోనా వైరస్ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సింగిల్ అంకెల నుండి డబల్ అంకెల కు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికీ మరో మూడు కేసులు పెరిగినట్లు వైద్య శాఖా తెలిపింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 36 కు చేరింది. ఈ మూడు కేసులు కూడా హైదరాబాద్ లోనే నమోదు కావడంతో నగర వాసుల్లో భయం ఎక్కువ అయ్యింది.

ప్రస్తుతం పెరిగిన కేసుల వివరాల్లోకి వెళ్తే.. 34వ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వారు కాగా..35వ కరోనా పాజిటివ్ కేసు హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళ .. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. వీరంతా కూడా ఇతర దేశాలనుండి హైదరాబాద్ కు వచ్చిన వారే. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com