తెలంగాణలో మరో 3 కరోనా కేసులు పెరిగాయి..
- March 24, 2020
కరోనా వైరస్ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సింగిల్ అంకెల నుండి డబల్ అంకెల కు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నాటికీ మరో మూడు కేసులు పెరిగినట్లు వైద్య శాఖా తెలిపింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య 36 కు చేరింది. ఈ మూడు కేసులు కూడా హైదరాబాద్ లోనే నమోదు కావడంతో నగర వాసుల్లో భయం ఎక్కువ అయ్యింది.
ప్రస్తుతం పెరిగిన కేసుల వివరాల్లోకి వెళ్తే.. 34వ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వారు కాగా..35వ కరోనా పాజిటివ్ కేసు హైదరాబాద్లోని చందానగర్కు చెందిన మహిళ .. మరో వ్యక్తి బేగంపేటకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు. వీరంతా కూడా ఇతర దేశాలనుండి హైదరాబాద్ కు వచ్చిన వారే. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!
- గల్ఫ్ దేశాలకు మెడిటరేనియన్ పార్లమెంట్ ఫోరమ్ సంఘీభావం..!!
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!







