భారత్ లో 10 శాతం తగ్గిన కరోనా కేసులు
- March 30, 2020
ప్రపంచమంతా శరవేగంగా వ్యాపిస్తున్న కవిడ్-19 , మన భారతదేశంలో కూడా వీరవిహారం చేస్తోంది. ఈ మహమ్మారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు. వారికి ఊరట కలిగిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఒక మంచి వార్తను అందించింది. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 1024 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 96 కేసులు రికవరీ అయ్యాయి. కొన్ని కేసుల్లో పేషెంట్లను డిశ్చార్జి కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా నుండి బయటపడిన ఏడుగురిని రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపింది. దీని వల్ల రికవరీ సంఖ్య ఇంకా పెరుగుతుంది. నిజంగా ఈ వార్త ఎంతో మందికి ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, కరోనా వైరస్ సోకిన వారిలో 82 శాతం మంది రికవరీ అవుతున్నారు. మిగతా 18 శాతం మంది చనిపోతున్నారు. కానీ మన దేశంలో మాత్రం మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. మన దేశంలో అంతగా వైద్య సదుపాయాలు లేనప్పటికీ, ఈ కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడడానికి మన డాక్టర్లు, నర్సులూ, వైద్య సిబ్బంది చాలా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులనూ మూసేయాలని ఆదేశించింది. అంతే కాకుండా, లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని ప్రకటించింది. వచ్చే రెండు వారాల్లో కేసుల రికవరీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయట.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలా చేస్తే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు ఉండబోదని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజులుగా చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పరుగుతూ, రికవరీ అయ్యే కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీని వల్ల వైరస్ను పూర్తిగా కంట్రోల్ చెయ్యగలమనే నమ్మకం డాక్టర్లకు కలుగుతోంది. మున్ముందు కూడా ఇలాగే పటిష్ట చర్యలు తీసుకుంటే, కరోనా మహమ్మారి మన దేశాన్నివదిలిపోతుందని వారు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







