కరోనా ఎఫెక్ట్: ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల లెటర్ ఉంటేనే ఉద్యోగులకు అనుమతి.
- April 02, 2020
మస్కట్:కరోనా వైరస్ కారణంగా దేశమంతా కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ భద్రతా అధికారులు ఉద్యోగుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా తప్పనిసరిగా తమ సంస్థల నుంచి లెటర్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా సంస్థల సీల్ తో పాటు సదరు ఉద్యోగి ఏ తరహా విధులు నిర్వహిస్తున్నాడు..ఎందుకోసం అతని సేవలు అత్యవసరమని భావిస్తున్నారో కూడా లేఖలో పేర్కొనాలని కోరారు. దేశ పౌరులతో పాటు నివాసితులు(రెసిడెంట్స్) లెటర్ తో పాటు తమ సివిల్, ఐడీ కార్డులను తప్పకుండా వారితోనే ఉంచుకోవాలని కూడా అధికారులు సూచించారు. దేశంలో పలు చోట్ల రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తేనే అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







