కరోనా ఎఫెక్ట్: ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల లెటర్ ఉంటేనే ఉద్యోగులకు అనుమతి.
- April 02, 2020మస్కట్:కరోనా వైరస్ కారణంగా దేశమంతా కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ భద్రతా అధికారులు ఉద్యోగుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా తప్పనిసరిగా తమ సంస్థల నుంచి లెటర్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా సంస్థల సీల్ తో పాటు సదరు ఉద్యోగి ఏ తరహా విధులు నిర్వహిస్తున్నాడు..ఎందుకోసం అతని సేవలు అత్యవసరమని భావిస్తున్నారో కూడా లేఖలో పేర్కొనాలని కోరారు. దేశ పౌరులతో పాటు నివాసితులు(రెసిడెంట్స్) లెటర్ తో పాటు తమ సివిల్, ఐడీ కార్డులను తప్పకుండా వారితోనే ఉంచుకోవాలని కూడా అధికారులు సూచించారు. దేశంలో పలు చోట్ల రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తేనే అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!